కారణం తెలియదు కానీ డాక్టర్ చదువు తున్న కుమార్తె తో సహా ఒక తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ దురదృష్టకరమైన సంఘటన నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో జరిగింది.
40 సంవత్సరాల భాగ్యశ్రీ 40 తన కుమార్తె సన్నీ (22)ని మెడిసిన్ వరకూ చదివించింది. ఎంతో కష్టపడి జీవితం గడుపుతూ కూడా కుమార్తె విద్యపై భాగ్యశ్రీ ఎంతో శ్రద్ధ చూపింది.
12 సంవత్సరాల కిందట భర్త నుంచి విడాకులు తీసుకున్న భాగ్యశ్రీ ఇప్పటి వరకూ వంటరిగానే జీవన పోరాటం చేసింది. ఇంటిని పోషించేందుకు చిన్న బ్యూటీ పార్లర్ నడుపుతూ కూతుర్ని మెడిసిన్స్ వరకు చదివిందని, అప్పులు కూడా చేసిందని స్థానికులు అంటున్నారు.
అయితే మరి ఏం జరిగిందో ఏమో కానీ ఇద్దరూ వారి ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్ల ఎస్ఐ తెలిపారు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.