32.7 C
Hyderabad
March 29, 2024 10: 27 AM
Slider కడప

బ్రహ్మంగారిమఠం వద్ద తల్లీ కూతుళ్ల దారుణ హత్య

#double murder

కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం డి. నేలటూరులో తల్లి కూతుళ్ల ను ఇద్దరినీ దారుణంగా హత్య చేశారు. హతులు తల్లి  అంజనమ్మ(55) కూతురు వరలక్ష్మి(35) గా గుర్తించారు.

2019 మే నెలలో అంజనమ్మ కోడలు చరిష్మా  అనుమానాస్పదంగా మృతి చెందింది. అదనపు కట్నం కోసం భర్త అత్త అడబిడ్డలే చంపారని  బంధువులు కేసు పెట్టారు. చరిష్మా శవాన్ని అంజనమ్మ ఇంట్లో నే బంధువులు పూడ్చిపెటారు. 

అంజనమ్మ కు చెందిన నాలుగు ఎకరాల భూమిని కోడలు బంధువులకు  పెద్దమనుషులు పంచాయితీ చేసి రాయించారు. పంచాయితీ అనంతరం అంజనమ్మ తన కుటుంబ సభ్యుల తో కలిసి బ్రహ్మంగారి మఠం లో నివసిస్తున్నారు.

నాలుగు ఎకరాల భూమిని అమ్ముతున్నారని అని తెలిసి అడ్డుకోవడానికి సొంత ఊరుకు వచ్చిన  అంజనమ్మ ను కూతురు వరలక్ష్మి ని కోడలు బంధువులు దారుణం గా నరికి చంపారు. 

సంఘటనా స్థలాన్ని  మైదుకూరు డిఎస్పి విజయ్ కుమార్ పరిశీలించారు. గ్రామంలో ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా మైదుకూరు రూరల్ సిఐ కొండారెడ్డి ఎస్ఐ శ్రీనివాసులు పర్యవేక్షిస్తున్నారు.

Related posts

ప్రధాన డిమాండ్ వదిలేశారుగా చర్చలు జరపండి

Satyam NEWS

ములుగు జిల్లా లో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

Satyam NEWS

మహాత్మా ఈ తహసీల్దార్ ను మన్నించు….

Satyam NEWS

Leave a Comment