కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం డి. నేలటూరులో తల్లి కూతుళ్ల ను ఇద్దరినీ దారుణంగా హత్య చేశారు. హతులు తల్లి అంజనమ్మ(55) కూతురు వరలక్ష్మి(35) గా గుర్తించారు.
2019 మే నెలలో అంజనమ్మ కోడలు చరిష్మా అనుమానాస్పదంగా మృతి చెందింది. అదనపు కట్నం కోసం భర్త అత్త అడబిడ్డలే చంపారని బంధువులు కేసు పెట్టారు. చరిష్మా శవాన్ని అంజనమ్మ ఇంట్లో నే బంధువులు పూడ్చిపెటారు.
అంజనమ్మ కు చెందిన నాలుగు ఎకరాల భూమిని కోడలు బంధువులకు పెద్దమనుషులు పంచాయితీ చేసి రాయించారు. పంచాయితీ అనంతరం అంజనమ్మ తన కుటుంబ సభ్యుల తో కలిసి బ్రహ్మంగారి మఠం లో నివసిస్తున్నారు.
నాలుగు ఎకరాల భూమిని అమ్ముతున్నారని అని తెలిసి అడ్డుకోవడానికి సొంత ఊరుకు వచ్చిన అంజనమ్మ ను కూతురు వరలక్ష్మి ని కోడలు బంధువులు దారుణం గా నరికి చంపారు.
సంఘటనా స్థలాన్ని మైదుకూరు డిఎస్పి విజయ్ కుమార్ పరిశీలించారు. గ్రామంలో ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా మైదుకూరు రూరల్ సిఐ కొండారెడ్డి ఎస్ఐ శ్రీనివాసులు పర్యవేక్షిస్తున్నారు.