నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర గోదావరి నది వద్ద తీవ్ర విషాదం చోటు చేసుకుంది నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది నిజామాబాదు జిల్లాకు చెందిన గోల్ హను మాన్ పెద్ద బజారుకు చెందిన బాలాదిత్య భవ్య శ్రీ మానసలుగా గుర్తించారు పోలీసులు భర్త
కొన్ని సంవత్సరాలు క్రితం మృతి చెందడంతో మృతురాలు నిజామాబాదులోని ఓ షాపింగ్ మాల్ లో పనిచేస్తుంది భర్త మృతి చెందినప్పటి నుండి తన అన్న ఇంటి వద్ద పిల్లలతో కలిసి ఉంటుంది స్థానిక పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు జరుపుతున్నారు. మృతికి సంబంధించిన కారణాలు ఇప్పటికీ తెలియ రాలేదు..