స్కూటీపై కుమార్తెతో కలిసి వెళుతున్న మహిళ రోడ్డు ప్రమాదంలో మరణించిన దురదృష్టకర సంఘటన విశాఖపట్నంలో కొద్ది సేపటి కింద జరిగింది. ఈ ప్రమాదంలో మరణించిన రమాదేవి (47) ఇక్కడి ఇమ్మిగ్రేషన్ ఎస్ఐ మోహన్ రావు భార్య. కంచరపాలెం నుండి మురళి నగర్ వైపు వెస్పా వెహికల్ పై వెళ్తుండగా బిర్లా జంక్షన్ వద్ద సిగ్నల్ పడడంతో రమాదేవి, స్కూటీ నడుపుతున్న శ్వేత ఆగారు.
దాంతో వెనక నుండి వేగంగా వస్తున్న లారీ ఢీ కొన్నది. లారీ ఢీ కొనడగంతో రమాదేవి రోడ్డుపై పడిపోయారు. లారీ ఆమె తలపై నుండి వేగంగా వెళ్ళిపోయింది. డ్రైవింగ్ నేస్తున్న శ్వేత ఎటువంటి గాయాలు అవకుండా ప్రమాదం నుండి తప్పించుకున్నారు. పక్కనే ఉన్న మయూరి చాంబర్ అపార్ట్ మెంట్ లో వారు నివాసం ఉంటున్నారు.