39.2 C
Hyderabad
April 25, 2024 16: 28 PM
Slider విశాఖపట్నం

చిరు మొగ్గను చిదిపేసిన రాక్షసి తల్లి

#girl child

విశాఖ పట్నం లోని మధురవాడ మారికవలస లో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది.

కన్నతల్లి తన మూడేళ్ల చిన్నారిని హతమార్చిన సంఘటన పలువురుని విస్మయానికి గురి చేసింది.

తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందని మూడు ఏళ్ల చిన్నారిని అతి దారుణంగా హత్య చేసి స్మశాన వాటికలో దహన సంస్కారాలు చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది.

మారికవలస గ్రామంలో నివాసం ఉంటున్న వర లక్ష్మి అనే వివాహిత కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటూ బోర జగదీశ్ రెడ్డి తో  సహ జీవనం సాగిస్తుంది.

ఏమైందో తెలియదు గానీ  చిన్నారిని హత మార్చినట్లు స్థానికుల కథనం. సంఘటనా స్థలానికి వరలక్ష్మి ని తీసుకొచ్చినప్పుడు గ్రామ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఆమెను కొట్టేందుకు ప్రయత్నించారు.

ఈ క్రమంలో స్థానికులకు పోలీసులకు తోపులాట తోపాటు పోలీస్ జీపులను ధ్వంసం చేశారు.

పోలీసులు ఘటనా ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకొని, నిందితులను దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

[Official] Amino Acid Supplements For Weight Loss Weight Loss Skinny Pill

Bhavani

వివేక హత్య కేసులో వివరాల వెల్లడి క్రమశిక్షణ ఉల్లంఘనే

Satyam NEWS

27న విద్యార్ధులతో ప్రధాని మోడీ చర్చ

Satyam NEWS

Leave a Comment