విశాఖ మారికవలస రాజీవ్ గృహాకల్ప కాలనీలో ఎవరూ ఊహించని దారుణ సంఘటన జరిగింది. వేధిస్తున్న కొడుకును ఎలా వదిలించుకోవాలో తెలియని ఒక తల్లి కొడుకును చంపేసింది.
విశాఖ మధురవాడ మారికవలస రాజీవ్ గృహాకల్ప కాలనీ కి చెందిన మాధవి తన కుమారుడు అనిల్ ను చంపేసినట్లు పోలీసులు తెలిపారు.
మృతుడు అనిల్ పై గతంలోనూ పలు ఫిర్యాదులు ఉన్నాయి. కొడుకు చేస్తున్న అఘాయిత్యాలు తట్టుకోలేక తల్లి తీవ్ర నిర్ణయం తీసుకున్నది. పీఎంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.