కూతురుపై అత్యాచారం కేసును ఉపసంహరించుకోవాలని కోరుతూ మీ తల్లిని నిందితులు కొట్టడం తో ఆమె మరణించిన ఘటన ఇది.వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో రెండేళ్ల క్రితం ఓ మైనర్ అమ్మాయిని అత్యాచారం చేసిన కేసులో నిందితులుగా ఉన్న ఆరుగురు ఆ అమ్మాయి తల్లిపై ఇటీవల దాడి చేశారు. ఆ దాడి వల్ల టీనేజర్ తల్లి తీవ్రంగా గాయపడింది.
హాస్పటల్లో చికిత్స పొందుతున్న ఆమె ఇవాళ మృతిచెందింది. లైంగిక వేధింపుల కేసులో ఆరుగుర్ని గతంలో అరెస్టు చేశారు. అందులో నలుగురు బెయిల్ తెచ్చుకున్నారు కేసును ఉపసంహరించుకోవాలని టీనేజర్ తల్లిపై వాళ్లు వత్తిడి తెచ్చారు. వినకపోవడంతో ఆ మహిళ ఇంటికి వెళ్లి దాడి చేశారు. అయితే ఆ దాడిని ఆమె ఇంటిపై నుంచి కొందరు షూట్ చేశారు. మహిళపై దాడి చేసిన కేసులో ముగ్గుర్ని అరెస్టు చేశారు. మరో ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.