బాగ్ అంబర్ పేట్ అయ్యప్ప దేవాలయం వద్ద రోడ్డు నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. నెల రోజుల క్రితం ఇక్కడ సీసీ రోడ్డు నిర్మాణం కోసం జిహెచ్ఎంసి సిబ్బంది రోడ్డును తవ్వి వేశారు.
గోతులమయంగా రహదారి
అప్పటినుండి రోడ్డంతా గోతుల మయంగా మారి వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఈ విషయమై అటు ప్రజాప్రతినిధులు గాని ఇటు జిహెచ్ఎంసి అధికారులు గాని పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే రోడ్డు నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.