గత 6 సంవత్సరాలుగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, డక్కిలి మండలం, వెలికల్లు గ్రామ కేంద్రంగా మౌనిక చారిటబుల్ ఫౌండేషన్ (MCF) వెంకటగిరి నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నది.
వెంకటగిరి నియోజకవర్గం లోనే కాకుండా హైదరాబాదులో మౌనిక చారిటబుల్ ఫౌండేషన్ కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నది.
హైదరాబాద్ లో మౌనిక చారిటబుల్ ఫౌండేషన్ సేవలు మరింత విస్తృత పరచాలని ఉద్దేశంతో హైదరాబాదులో ప్రముఖులను కలిసి, తన ఫౌండేషన్ గురించి తెలియ చేసి, తాను చేయబోయే సేవా కార్యక్రమాలకు సహకారం అందించాల్సిందిగా మౌనికా రెడ్డి కోరుతున్నారు.
అందులో భాగంగా ప్రముఖ గాయకులు, 700 భగవద్గీత శ్లోకాలను అనర్గళంగా కంఠత పట్టి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన మహానుభావుడు, “భగవద్గీత ఫౌండేషన్” వ్యవస్థాపక చైర్మన్ ఎల్.వి. గంగాధర శాస్త్రి వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
మౌనిక చారిటబుల్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాల గురించి ఆయనతో చర్చించారు. తన పొండేషన్ ద్వారా పేదలకు అవసరమైన సేవా కార్యక్రమాలు చేసే విషయంలో సహకరించాలని ఆయనను మౌనిక రెడ్డి కోరగా అందుకు గంగాధర శాస్త్రి సానుకూలంగా స్పందించారు.
సంతోషం వ్యక్తం చేసి, ఆమె సేవా భావానికి అభినందనలు తెలియజేస్తూ తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన తెలిపారు.
వెంకటగిరి సామాన్యుడు