కరోనా వైరస్ నుండి నిర్మల్ జిల్లా ప్రజలు బయట పడడం లో జిల్లా అధికారుల తో పాటు జిల్లా ప్రజల సహకారం మరువలేనిది అని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఈరోజు ఎమ్మెల్యే భవన్లో నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రస్తుతం నిర్మల్ జిల్లా ఆరెంజ్ జోన్ లో ఉంది త్వరలో గ్రీన్ జోన్ లోకి వెళ్తున్నాం అని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రంలో 25 వేల రూపాయల మేరకు రైతుల రుణాలను మాఫీ చేస్తున్నారని, ఆ డబ్బు రైతుల అకౌంట్ లో సోమవారం నుండి వేస్తారని అన్నారు.
దీని కోసం నిధులు విడుదల చేశారని ఆయన అన్నారు. జిల్లాలో పండించిన మొక్కజొన్న మొత్తాన్ని ప్రభుత్వం కొంటుందని మంత్ర హామీ ఇచ్చారు. జిల్లాలో రైతులు పండించిన వరి ధాన్యం మొత్తాన్ని కొనటానికి ఏర్పాట్లు చేస్తున్నామని, కందులు, పసుపు రైతుల కోసం పసుపు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు.