39.2 C
Hyderabad
April 25, 2024 16: 42 PM
Slider నెల్లూరు

మంత్రి గౌతమ్ రెడ్డి కి ఎంపీ ఆదాల శ్రద్ధాంజలి

#adalaprabhakarreddy

నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మంగళవారం దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి పార్ధివ దేహానికి నెల్లూరులోని ఆయన స్వగృహంలో పుష్పాంజలి   ఘటించారు. ఆయన తండ్రి మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారిని ఓదార్చారు.

పోలీస్ పరేడ్ గ్రౌండ్లో  శ్రద్ధాంజలి

దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి  పార్థివదేహాన్ని హైదరాబాద్ నుంచి సైనిక హెలికాఫ్టర్ లో నెల్లూరుకు తీసుకువచ్చారు.  నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో  హెలికాప్టర్ దిగాక శ్రద్ధాంజలి ఘటించారు. ఆయనతోపాటు మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కిలివేటి సంజీవయ్య, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కలెక్టర్ చక్రధర బాబు ,ఎస్పీ విజయరావు, మేయర్ పొట్లూరి స్రవంతి. కుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్, రూరల్ ఇంఛార్జ్ గిరిధర్ రెడ్డి . గౌతమ్ రెడ్డి సోదరులు కూడా శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం గౌతమ్ రెడ్డి పార్ధివదేహాన్ని నెల్లూరులోని ఆయన ఇంటికి తరలించారు. అక్కడ ఎమ్మెల్యేలు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. వర ప్రసాద్ రావు తదితర ప్రముఖులు ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు జడ్పిటిసి మల్లు సుధాకర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ స్వర్ణ వెంకయ్య, గునపాటి రమేష్ రెడ్డి, నరసింహారావు, మధు, జిల్లాలోని పలువురు ప్రముఖులు అభిమానులు తరలి వచ్చి గౌతమ్ రెడ్డి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.

Related posts

దేశంలో ఎస్సీ, ఎస్టీలపై పెరిగిన దాడులు

Sub Editor

Free Trial Male Penile Enhancement Surgery Pictures Maxman Ii Capsules Male Enhancement

Bhavani

ప్రార్ధించే పెదవుల కన్నా…సాయం చేసే చేతులు మిన్న..

Satyam NEWS

Leave a Comment