తెలంగాణ ప్రభుత్వం లో శాంతి భద్రతలు పూర్తీ గా కరువయ్యాయని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శనివారం అయన పర్యటించారు . ఈ సందర్భంగా పట్టణంలో ఇటీవల లైంగిక వేధింపులు ఎదుర్కొన్న ఎస్సీ, ఎస్టీ బాలికల వసతి గృహాన్ని ఆయన సందర్శించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతల పరిరక్షణలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, సిరిసిల్ల పార్టీ నాయకులు ఆవునూరి రమాకాంత్ ,విష్ణు ,బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు