ప్రమాద బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ ప్రబుత్వాన్న్ని కోరారు.జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం గౌరాపురం గ్రామస్తులు ఇటీవల కురిక్యాల వద్ద జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను వారిరువురు పరామర్శించారు.
మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా, ఇంటికొక ఉద్యోగం, ప్రతి కుటుంబానికి 5 ఎకరాల భూమి కేటాయించాలని, ప్రమాదం జరిగి వారం రోజులైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు.