రాష్ట్రంలో శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలను వైసీపీ నాశనం చేసిందని నర్సాపురం ఎంపీ రఘురామ రాజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
అమరావతి రైతుల గురించి రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ఇప్పుడు న్యాయవ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నం కొనసాగుతుందన్నారు.
ముఖ్యమంత్రిపై కేసుల విచారణ త్వరగా జరగాల్సిందిగా కోరడానికి బదులు విచారణ జరుపుతున్న వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని వాపోయారు.
మిమ్మల్ని మీరు కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా వ్యవస్థలను భ్రష్టు పట్టించడం తగదని హితవు పలికారు. ఇటువంటి చర్యలవల్ల రాజ్యాంగ సంక్షోభం తలెత్తి రాష్ట్రపతి పాలన దిశగా వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు.