ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు మరో అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు.
పోలవరం నిర్వాసితుల పేరుతో అక్రమాలు జరుగుతున్నట్లు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ కు ఆయన ఫిర్యాదు చేశారు.
నిజమైన లబ్ధిదారులను పక్కనపెట్టి నకిలీ లబ్దిదారులను ఎంపిక చేస్తున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
నకిలీ ఖాతాలతో నిర్వాసితుల సొమ్ము కాజేస్తున్నారని ఆయన తెలిపారు. రివర్స్ టెండరింగ్ పేరుతో అదనపు నిధులు కేటాయిస్తున్నారని, కేటాయింపులు పెంచి 25 శాతం వరకు కమీషన్లు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
దీనిపై వెంటనే పరిశీలన జరిపి చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రికి రఘురామకృష్ణంరాజు విజ్ఞప్తి చేశారు.
అంతే కాకుండా తనపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేసిన దాడి గురించి లాకప్ లో తనకు ఎదురైన చిత్ర హింసల పై కూడా కేంద్ర మంత్రికి ఆయన ఫిర్యాదు చేశారు. పోలవరం అంశంతో పాటు తనపై దాడి వివరాలను పేర్కొంటూ రెండు వేర్వేరు లేఖలు కేంద్రమంత్రికి అందజేసినట్లు తెలిసింది.