విశాఖలోని చారిత్రక ప్రాంతాల్లో నిర్మాణాలపై కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, నర్సాపురం పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణరాజు లేఖ రాశారు.
కాపులుప్పాడను చారిత్రక ప్రాంతంగా ప్రకటించాలని ఆయన కోరారు. ‘‘తొట్లకొండ బౌద్ధారామం దగ్గరున్న కాపులుప్పాడను రక్షించాలి. ఈ ప్రాంతంలో వీఐపీ అతిథిగృహానికి భూమిపూజ చేసినట్లు తెలిసింది.
1978లో తొట్లకొండను చారిత్రక ప్రదేశంగా రాష్ట్రం ప్రకటించింది. బఫర్ జోన్కు 300మీటర్ల దూరాన్ని రక్షిత ప్రాంతంగా గుర్తించాలని సుప్రీం కోర్టు చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం ఆదేశాలు, కేంద్రం విధించిన నిబంధనలను ఉల్లంఘిస్తోంది. వెంటనే తగిన చర్యలు తీసుకొని చారిత్రక ప్రదేశాలను రక్షించాలి’’ అని కేంద్రానికి రాసిన లేఖలో ఆయన విజ్ఞప్తి చేశారు.