37.2 C
Hyderabad
March 29, 2024 18: 11 PM
Slider ముఖ్యంశాలు

కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రికి ఎంపీ రఘురామ లేఖ

#Raghuramakrishnam Raju MP

విశాఖలోని చారిత్రక ప్రాంతాల్లో నిర్మాణాలపై కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, నర్సాపురం పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణరాజు లేఖ రాశారు.

కాపులుప్పాడను చారిత్రక ప్రాంతంగా ప్రకటించాలని ఆయన కోరారు. ‘‘తొట్లకొండ బౌద్ధారామం దగ్గరున్న కాపులుప్పాడను రక్షించాలి. ఈ ప్రాంతంలో వీఐపీ అతిథిగృహానికి భూమిపూజ చేసినట్లు తెలిసింది.

1978లో తొట్లకొండను చారిత్రక ప్రదేశంగా రాష్ట్రం ప్రకటించింది. బఫర్‌ జోన్‌కు 300మీటర్ల దూరాన్ని రక్షిత ప్రాంతంగా గుర్తించాలని సుప్రీం కోర్టు చెప్పింది.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీం ఆదేశాలు, కేంద్రం విధించిన నిబంధనలను ఉల్లంఘిస్తోంది. వెంటనే తగిన చర్యలు తీసుకొని చారిత్రక ప్రదేశాలను రక్షించాలి’’ అని కేంద్రానికి రాసిన లేఖలో ఆయన విజ్ఞప్తి చేశారు.

Related posts

రూ.1.25 కోట్లతో వైజాగ్ లో కోవిడ్-19 పరీక్ష కేంద్రం

Satyam NEWS

ట్రాన్స్ఫర్ :తెలంగాణాలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

Satyam NEWS

రేపు కేటీఆర్, రేవంత్ రెడ్డి రాక: హాట్ హాట్ గా కామారెడ్డి రాజకీయాలు

Satyam NEWS

Leave a Comment