కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, నర్సాపూర్ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు నేడు సమావేశమయ్యారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ఎత్తి చూపినందుకు షోకాజ్ నోటీసు అందుకున్న ఆయన ఢిల్లీలో పలువురు ముఖ్యనేతలను కలుస్తున్నారు.
అందులో భాగంగా ఆయన నేడు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సమావేశం కావడం గమనార్హం. దేశ రాజకీయాలపై పలు అంశాలు వారిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ లో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న లోపభూయిష్టమైన పాలనపై ఆయన రాజ్ నాథ్ సింగ్ కు వివరించినట్లు తెలిసింది. రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాలు, రాజకీయ ప్రత్యర్థులను అణగదొక్కుతున్న విధానంపై రఘురామకృష్ణంరాజు కేంద్ర రక్షణ శాఖ మంత్రికి వివరించి చెప్పినట్లు తెలిసింది.