అధికార పార్టీ ఎమ్మెల్యే చేసిన నిర్వాకంతో ఒక అధికారి సస్పెన్షన్ కు గురయ్యారు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం లో ఈ సంఘటన జరిగింది.
పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు నిర్వాకంతో ఎంపీడీఓ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ కు గురయ్యారు.
కొవేగ్జిన్ వ్యాక్సిన్ రెండవ డోస్ మాత్రమే వేయాల్సి ఉండగా 11 మందికి మొదటి డోస్ ను ఎమ్మెల్యే బలవంతంగా వేయించారు.
ఎంపీడీఓపై ఒత్తిడి తెచ్చి భార్య, కుమారుడు సహా 11 మంది బంధువులకు ఎమ్మెల్యే చిట్టిబాబు మొదటి డోస్ వేయించారు.
ఈ వ్యవహారంపై అమలాపురం సబ్ కలెక్టర్ విచారణ అనంతరం ఎంపీడీఓ ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.