మామూలుగా ఎవరైనా మోసం చేస్తే పోలీసులకో, అధికారులకో చెబుతారు. ప్రభుత్వ అధికారే మోసం చేస్తే…..?
ఏం చేయాలో తెలియక మోసపోయిన వ్యక్తులు అమరావతిలో సచివాలయం వద్ద ఆత్మహత్య చేసుకోబోయారు.
ఈ దారుణ సంఘటన పలు ప్రశ్నలను లేవనెత్తుతున్నది. అన్ని అధికారాలను గుప్పిట్లో పెట్టుకున్న అధికారులు, ప్రజల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని కూడా ఈ సంఘటన రుజువు చేస్తున్నది.
నెల్లూరు జిల్లా దుత్తలూరు ఎంఆర్ఓo చంద్రశేఖర్ తమ దగ్గర ఒక కోటి రూపాయల పైన తీసుకుని మోసం చేశారని వీరు ఆరోపిస్తున్నారు.
ఈ భార్యాభర్తలు ఇద్దరు పిల్లలతో పెట్రోల్ డబ్బాతో వచ్చి ఆత్మహత్య యత్నం చేశారు. పొలం ఆన్ లైన్ చేస్తా అని డబ్బులు తీసుకుని మోసం చేశాడని వారు ఆరోపిస్తున్నారు.
ఆత్మహత్య యత్నం సమాచారం తెలుసుకుని సచివాలయం కు పోలీసులు వచ్చారు. ఆత్మహత్య కు యత్నించిన దంపతులను అదుపులోకి తీసుకున్నారు.