31.2 C
Hyderabad
April 19, 2024 03: 15 AM
Slider మహబూబ్ నగర్

రైతు నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తహశీల్దార్

#kollapurmro

డబ్బుల కోసం రైతును పీడించిన తహశీల్దార్ ను అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్న సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో జరిగింది.

కొల్లాపూర్ తహశీల్దార్ కార్యాలయంలో గురువారంనాడు ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అవినీతి చర్యలకు పాల్పడిన తహశీల్దార్ షౌకత్ ఆలీ, వీఆర్ఏ కృష్ణ, కంప్యూటర్ ఆపరటర్ శివ రెడ్ హ్యాండెడ్ గా దొరకారు.

ఏడు డాక్యుమెంట్స్ ఇవ్వడానికి వీరు ఒక రైతు నుంచి పన్నెండువేల రూపాయలు లంచం డిమాండ్ చేశారు. ఎంతోకాలం నుండి తనకు కావాల్సిన డాక్యుమెంట్లు ఇవ్వాలని ఎంత బ్రతిమిలాడిన ఇవ్వకుండా కాలయాపన చేస్తూ డబ్బులు ఇస్తేనే చేస్తామని అన్నారు.

దాంతో దిక్కులేక ఏసీబీ ని ఆశ్రయించిననట్లు రైతు తెలిపారు.

Related posts

రైతుల అభ్యున్నతి కోసమే నూతన రెవిన్యూ చట్టం

Sub Editor

నూత‌న విద్యా విధానంతో బంగారు భ‌విష్య‌త్తు..!

Satyam NEWS

మా నాన్న అన్న ఆ ఒక్క మాట వెయ్యి సినిమాలు చేసే శక్తినిచ్చింది!!

Bhavani

Leave a Comment