డబ్బుల కోసం రైతును పీడించిన తహశీల్దార్ ను అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్న సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో జరిగింది.
కొల్లాపూర్ తహశీల్దార్ కార్యాలయంలో గురువారంనాడు ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అవినీతి చర్యలకు పాల్పడిన తహశీల్దార్ షౌకత్ ఆలీ, వీఆర్ఏ కృష్ణ, కంప్యూటర్ ఆపరటర్ శివ రెడ్ హ్యాండెడ్ గా దొరకారు.
ఏడు డాక్యుమెంట్స్ ఇవ్వడానికి వీరు ఒక రైతు నుంచి పన్నెండువేల రూపాయలు లంచం డిమాండ్ చేశారు. ఎంతోకాలం నుండి తనకు కావాల్సిన డాక్యుమెంట్లు ఇవ్వాలని ఎంత బ్రతిమిలాడిన ఇవ్వకుండా కాలయాపన చేస్తూ డబ్బులు ఇస్తేనే చేస్తామని అన్నారు.
దాంతో దిక్కులేక ఏసీబీ ని ఆశ్రయించిననట్లు రైతు తెలిపారు.