సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో MRPS రాష్ట్ర కార్యదర్శి రావూరు విజయభాస్కర్ మాదిగ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా విజయభాస్కర్ మాదిగ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో దళితులు ముఖ్యమైన భూమిక పోషించారని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి జరగబోయే శాసనసభ సమావేశాలలో డప్పుకు, చెప్పుకు నెలకు 2000 రూపాయలు పెన్షన్ ప్రకటించి దళితుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం తన ప్రేమను ప్రకటించాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో హుజూర్ నగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ వయస్కుల జయరాజు మాదిగ, రాష్ట్ర సహాయక కార్యదర్శి తప్ప పెంటయ్య మాదిగ, గుండెపంగు బాబు మాదిగ,మిద్దె ఎక్కువసార్లు మాదిగ,MSF హుజూర్ నగర్ నాయకులు పాపట్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.