దొరల తెలంగాణ విముక్తి కోసం ఎస్సి ఎస్టీ బిసి మైనార్టీల ప్రజలు సామాజిక తెలంగాణ కోసం మలిదశ ఉద్యమ పోరాటానికి సిద్ధం కావలని MRPS నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మైలారం బాలు మాదిగ పిలుపునిచ్చారు. తెలంగాణ అవతరణ దినోత్సవ సందర్భంగా ఈ రోజు MRPS ఆధ్వర్యంలో ఆర్మూర్ టౌన్ అంబెడ్కర్ చౌరస్తాలో దళితులను వంచించిన కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.
తెలంగాణ ప్రజలు దొరల తెలంగాణ కోరుకోలేదని సామాజిక తెలంగాణ కోరుకున్నారని ఈ సందర్భంగా మైలారం బాలు మాదిగ అన్నారు. అమరుల త్యాగాలు విద్యార్థుల పోరాటాలను కేసీఆర్ మరిచారని అన్నారు.
అమరుల త్యాగాలను పక్కకు పెట్టి ఈ రోజు కేసీఆర్ పాలనలో తెలంగాణ ద్రోహులను తెలంగాణను అడ్డుకున్నవారిని మంత్రి పదవులు ఇచ్చి అందలం ఎక్కించరని ఆయన అన్నారు. ఉద్యమకారులకు కనీస గౌరవం ఇవ్వకుండా అవమానిస్తూ కేసీఆర్ అక్రమాలను మోసాలను ప్రశ్నిస్తే అరెస్ట్ చేయిస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తొలి ముఖ్యమంత్రి దళితుడే అని దళిత సమాజాన్ని కేసీఆర్ మోసం చేశారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో Mrps అర్ముర్ మండల ఇంచార్జి సుద్దపల్లి మార్క్,mrps నాయకులు వాగ్మరే బాబు, జక్రాన్ పల్లి మండల అధ్యక్షులు చేవూరి శ్యామ్ మాదిగ, MSF జిల్లా అధ్యక్షులు విప్లవ్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.