27.7 C
Hyderabad
April 25, 2024 07: 12 AM
Slider ముఖ్యంశాలు

నోముల భగత్ కు ఎమ్మార్పీఎస్ టీఎస్ సంపూర్ణ మద్దతు

#MRPS

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో బడుగు బలహీన వర్గాలకు చెందిన దివంగత నేత నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్ కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మేడి పాపన్న ప్రకటించారు. నోముల భగత్ ను అధిక మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా నాగార్జున సాగర్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మేడి పాపన్న, వంగపల్లి మాట్లాడుతూ బలహీన వర్గాలకు చెందిన నాయకత్వాన్ని జీర్ణించుకోలేని ప్రధాన పార్టీలు అగ్రకులాలకు చెందిన వారిని పోటీకి దించాయని అన్నారు. నోముల నర్సింహయ్య అకాల మరణం జరిగితే ఆ స్థానానికి ఆయన కుమారుడు నోముల భగత్ ను ఏకగ్రీవం చేసి ఉండాల్సిందని అన్నారు. కాంగ్రెస్ బిజెపి పార్టీలు పోటీ చేయడం హేయమైన రాజకీయ చర్యగా అని వారు దుయ్యబట్టారు.

దళిత బహుజన నాయకులను ఎదగనీయకుండా జాతీయ పార్టీలు కాంగ్రెస్ బిజెపి అగ్రకుల అభ్యర్థులను పోటీ చేయించడం వారిని రాజకీయానికి సూచిక అని హెచ్చరించారు. దివంగత నేత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నోముల నర్సింహయ్య తన జీవితాంతం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని వారి కుమారుడు సంపూర్ణ మద్దతు ప్రకటించి ఇతర పార్టీలు నామినేషన్ విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో కోర్ కమిటీ సభ్యులు చిలకమర్రి గణేష్ మాదిగ, యువసేన రాష్ట్ర అధ్యక్షులు పొట్ట పెంజర రమేష్ మాదిగ, కోర్ కమిటీ సభ్యులు దైద రవి ,జిల్లా అధ్యక్షులు ముదిగొండ ఎల్లేష్ మాదిగ ,మారపాక నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

రైతులను ఇబ్బంది పెట్టొద్దు

Bhavani

దళారులను నమ్మి మోసపోవద్దు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్

Bhavani

ములుగు లో అంగన్ వాడీ టీచర్స్ & హెల్పర్స్ అసోసియేషన్ సమావేశం

Satyam NEWS

Leave a Comment