నిర్మల్ జిల్లా ముధోల్ శాసనసభ సభ్యులు జి. విఠల్ రెడ్డి నేడు బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన విఠల్ రెడ్డికి ఆలయ మర్యాదలతో కార్యనిర్వహణాధికారి వినోద్ రెడ్డి స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో ఆలయ AEO సుదర్శన్ గౌడ్, స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్, ప్రధానార్చకులు సంజీవ్ పూజారి కూడా పాల్గొన్నారు. ఎమ్మెల్యే తో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించి ఆశీర్వచనం అందజేశారు.
బాసర శ్రీ జ్ఞాన సరస్వతి, మహాలక్మి, మహాకాళి అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేసిన అనంతరం ఎమ్మెల్యేకు ఆలయ తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ పరిసరాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిశీలించారు.
మంచి నాణ్యతతో పనులు పూర్తి చేస్తున్నారని కార్యనిర్వహణాధికారిని అభినందించారు. ఎమ్మెల్యేతో బాటు బాసర సర్పంచ్ డి. లక్ష్మణ్ రావ్, pacs చైర్మన్ వెంకటేష్ గౌడ్, vice mpp నర్సింగ్ రావు, సర్పంచులు సంఘం అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి,
బాబురావు పటేల్, సవలి రమేష్, మండల అధ్యక్షుడు మల్లుయదవ్, సయేద్ అలీ, ఫాసి, g శ్యామ్, పోతన్న, షైనవాజ్, సీనియర్ నాయకుడు ఖలీల్ భాయ్, దేవేందర్, జ్ఞాని, యూత్ నాయకుడు కార్తీక్ రావు తదితరులు ఉన్నారు.