సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ కి సంఘీభావంగా హుజుర్ నగర్ పట్టణ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో టౌన్ హాల్ నుండి పొట్టి శ్రీరాములు సెంటర్,మిర్యాలగూడ క్రాస్ రోడ్డు ఇందిరా సెంటర్ వరకు నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ కెసిఆర్ ఇంటి పార్టీ కాదని, ఉద్యమ పార్టీ అని అన్నారు. కేసీఆర్ తో పాటు ఉద్యమంలో పనిచేసిన ఉద్యమకారులను అణగ త్రొక్కటం సరియైనది కాదని, ఆనాటి ఆలే నరేందర్ నుండి నేటి ఈటల రాజేందర్ వరకు అణగా త్రొక్కుతూ టిఆర్ఎస్ పార్టీ కుటుంబ పార్టీగా మారుస్తున్నారని, దొరల పాలనకు చరమగీతం పాడాలని తన మంత్రివర్గంలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు అనుభవిస్తున్న అవినీతి నాయకులను తొలగించాలని అన్నారు. ఈటల కు ఒక న్యాయం, వేరే వారికి ఇంకో న్యాయమా అని అన్నారు.ఈటల రాజేందర్ ఒక బీసీ వ్యక్తి కనుకనే మంత్రివర్గం నుంచి తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.