తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బెదిరించి ఉద్యమాలు చేసే ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్లకు సంబంధించి ప్రాధేయపడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి నేడు ఒక లేఖ రాశారు. బలిజ, తెలగ, ఒంటరి కులాల రిజర్వేషన్లు ఇవ్వడానికి దృష్టి పెట్టమని ఆయన తన లేఖలో కోరారు. కాపుల పోరాటానికి ముగింపు పలికే విధంగా మీ అడుగులు ఉండాలని నా వ్యక్తిగత అభిప్రాయమండి అంటూ ఆయన ముఖ్యమంత్రిని ప్రాధేయపడ్డారు.
రైలు బస్సు వెళ్లిపోయిన తర్వాత ప్రయాణీకులు వెళ్లినట్లుగా మీ నిర్ణయం ఉండకూడదండీ అంటూ కాపుల రిజర్వేషన్లపై సలహా ఇస్తూ అణకువగా అడిగారు. కాపులను అందరూ ఉపయోగించుకుని గెలిచిన తర్వాత తొకేశారని చెబుతూ మీరు అలా చేయవద్దండీ అంటూ ముద్రగడ పద్మనాభం బతిమాలారు.
2016 ఫిబ్రవరి ఒకటో తేదీన కాపులకు రిజర్వేషన్లు కల్పించేందుకు మద్దతు తెలిపినట్లు విన్నానని, రిజర్వేషన్ల విషయంలో న్యాయం చేయాలని మరో మారు మిమ్మల్ని కోరుకుంటున్నానండి అంటూ బతిమిలాడుతూ ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రికి లేఖ రాశారు.