లాక్డౌన్ ను పటిష్టంగా అమలు చేయాలని, విధుల నిర్వహణలో జాగ్రత్తగా ఉండాలని ములుగు ఏ ఎస్ పి పోతరాజు సాయి చైతన్య అన్నారు.
నేడు ఆయన ములుగు జిల్లా కేంద్రంలో లాక్ డౌన్ తీరును పరిశీలించారు.
స్థానికంగా జీవనం సాగించే కూరగాయల వ్యాపారులతో మాట్లాడుతూ వారి సాధకబాధకాలు తెలుసుకొని ఈ విపత్కర పరిస్థితులు కొన్ని రోజులే ఉంటాయని భరోసా ఇచ్చారు.
కరోనా వ్యాధి శాశ్వతంగా వెళ్ళిపోయే వరకు ప్రజలందరూ ప్రభుత్వ నియమాలు పాటించి సహకరించాలని వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ఈ తరుణంలో ప్రజల ఆరోగ్యం రక్షణ కోసం ప్రభుత్వం లాక్డౌన్ ఏర్పాటు చేసిందన్నారు.
ప్రజలు అనవసరంగా రోడ్లపై కి రావొద్దు అని ఈ సందర్భంగా కోరారు. లాక్డౌన్ మినహాయింపు సమయంలో కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడాలని అనవసరంగా గుంపులుగా చేర వద్దు అని అన్నారు.
విధిగా మాస్కు ధరించాలన్నారు. గుంపులుగా చేరితే భౌతిక దూరం పాటించకపోవడం పై కేసు నమోదు చేస్తాం అన్నారు.
ఈ లాక్ డౌన్ పరిశీలన కార్యక్రమంలో ములుగు సిఐ గుంటి శ్రీధర్, ఎస్ ఐ ఓంకార్ యాదవ్ సిబ్బంది పాల్గొన్నారు.