ములుగు లాంటి వెనుబడిన ప్రాంతంలో జన్మించి జాతీయ స్థాయిలో రాణిస్తున్న ఇద్దరిని ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ కుసుమ జగదీష్ నేడు అభినందించారు.
ములుగు జిల్లా వెంకటాపుర్ మండలానికి చెందిన రాంయిండ్ల ప్రణయ్ తెలంగాణ రాష్ట్రం తరపున నేషనల్ వాలీబాల్ క్రీడలో గోల్డ్ మెడల్ సాధించారు.
అదే విధంగా ములుగు మండలంలోని కాసిందేవి పేట కు చెందిన గుంటి తేజస్విని ఎంబీబీస్ లో సీటు సాధించి ఆదిలాబాద్ లో చదువుకుంటున్నారు.
ఈ ఇద్దరూ పట్టుదలతో మరింత ముందుకు సాగాలని కుసుమ జగదీష్ ఆకాంక్షించారు.
అనంతరం వెంకటాపుర్ జడ్పీటీసీ రుద్రమదేవి అశోక్ కలిసి జడ్పీ చైర్మన్ వారిద్దరిని శాలువ కప్పి సన్మానించి అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి డీసీసీబీ డైరెక్టర్ మాడుగుల రమేష్, పోరిక గోవింద్ నాయక్, మండల అధికార ప్రతినిధి చంటి భద్రయ్య, తాహిర్ పాషా మండల ముఖ్య నాయకులు, తదితరులు ఉన్నారు.