డాక్టర్ అప్పయ్య ను ములుగు డి ఎం హెచ్ ఓ గా కొనసాగించాలని ములుగు జిల్లా సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ప్రజాసంఘాల జెఎసి చైర్మన్ ముంజల భిక్షపతి గౌడ్ డిమాండ్ చేశారు.
ఈరోజు జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ డాక్టర్ అప్పయ్య ఆదివాసి ముద్దుబిడ్డ అని ఏజెన్సీ మారుమూల ప్రాంతంలో పుట్టిన బిడ్డ అని ఈ ములుగు ఏజెన్సీ ప్రాంతమైనందున డాక్టర్ అప్పయ్య కు ఈ ములుగు ఏజెన్సీ గిరిజన ప్రాంతం పైన అవగాహన కలిగిన వ్యక్తి అని ఇప్పుడిప్పుడే ములుగు ఏజెన్సీ గిరిజన ప్రజలకు వైద్య రంగం అందుబాటులోకి వస్తున్న సందర్భంలో బదిలీ చేయడం చాలా బాధకరమని ముంజల బిక్షపతి అన్నారు.
ఏజెన్సీ ప్రాంతాలలో వైద్యరంగం అందుబాటులోకి రావాలంటే గిరిజన ముద్దుబిడ్డ నే డి ఎం హెచ్ ఓ గా నియమించాలని బిక్షపతి డిమాండ్ చేశారు. ఇప్పటికైనా డిప్యూటేషన్ పైన ఇన్చార్జిగా నైనా ములుగు జిల్లా డి ఎం హెచ్ ఓ గా డాక్టర్ అల్లం అప్పయ్య ను నియమించి ములుగు ఏజెన్సీ ప్రాంత గిరిజనులకు వైద్యం అందే ఈ విధంగా కృషి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు.
ఈ సమావేశంలో మాలమహానాడు సంఘం జిల్లా అధ్యక్షులు మా దారి భద్రయ్య శ్రీను రవి సాంబయ్య సురేష్ శోభన్ సౌందర్య తదితరులు పాల్గొన్నారు.