ములుగు లైన్స్ క్లబ్ ఆఫ్ సారధ్యంలో నేడు ములుగు మండలం లోని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్ధినీ విద్యార్ధులకు డిక్షనరీలను ఉచితంగా పంపిణీ చేశారు.
మొత్తం ఏడు స్కూళ్లలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. గౌట్ హైస్కూల్, బాయ్స్ హై స్కూల్, గర్ల్స్ హై స్కూల్, బండారు పెళ్లి హైస్కూల్, దేవగిరిపట్నం హైస్కూల్, దేవగిరిపట్నం మైనార్టీ గర్ల్స్ స్కూల్, జంగాల పెళ్లి హైస్కూల్ లలో మొత్తం 140 మందికి డిక్షనరీలు పంచిపెట్టారు.
10 తరగతి పరీక్ష లకు ఈజీగా ప్రిపేర్ కావడానికి ఈ డిక్షనరీ లు ఉపయోగపడతాయి. ఈ కార్యక్రమానికి లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ G M T కోఆర్డినేటర్ 320 F వరంగల్ N. వెంకటేశ్వర రావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. విద్యార్థిని విద్యార్థులు సేవానిరతితో ఉండాలని, కన్న తల్లిదండ్రులను, గురువులను ఎప్పుడూ పూజిస్తూ ఉండాలని ఆయన సూచించారు.
విద్యతో పాటు రాబోయే కాలంలో ఏది సాధించాలన్నా ఇప్పటి నుండే గోల్ సెట్టింగ్ చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమానికి లయన్ కొండి సాంబశివ డిస్ట్రిక్ట్ చైర్ పర్సన్, F Z C లయన్ సానికొమ్ము రవీందర్ రెడ్డి లయన్ డాక్టర్ A.ప్రవీన్ చెందర్ ప్రజిడెంట్, లయన్ ముక్కు సుబ్బారెడ్డి ట్రెజరెర్ లయన్ D.బలరాంరెడ్డి బోర్డు డైరెక్టర్, ములుగు జిల్ల విద్యా శాఖ అడ్మినిస్ట్రేటర్ B.సుదర్శన్ రెడ్డి, జిల్లా సైన్స్ ఆఫీసర్ జెయదేవ్ పాల్గొన్నారు.