జేఈఈ మెయిన్స్ లో 41 65 ర్యాంకు సాధించిన ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం, కంతనపల్లి గ్రామానికి చెందిన దబ్బకట్ల సమ్మక్కకు ములుగు లయన్స్ క్లబ్ సాయం చేసింది. ఆ విద్యార్ధినికి ఇరవై వేల రూపాయల రూపాయల ఆర్థిక సహాయాన్ని ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ద్వారా అందచేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ చేసే సహాయం విద్యార్థినికి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. లయన్స్ క్లబ్ ములుగు వారు ముందుకొచ్చి విరాళం అందించిందుకు చాలా సంతోషమని అభినందించారు.
ఈ కార్యక్రమంలో తాడువాయి ఎమ్మార్వో ములుగు లయన్స్ క్లబ్ మెంబర్ ముల్కనూర్ శ్రీనివాస్, ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయ ఏవో శ్యామ్,గంగిశెట్టి మోహన్ ప్రసాద్, లయన్ గంగిశెట్టి శ్రీనివాస్, ములుగు లయన్స్ క్లబ్ అధ్యక్షులు సానికొమ్ము రవీందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు చుంచు రమేష్, ములుగు లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.