మూడేళ్ల బాలికపై అత్యంత క్రూరంగా అత్యాచారం చేశాడు ఒక మృగాడు.
హైదరాబాద్ దమ్మాయిగూడ జోహార్ నగర్ పిఎస్ పరిధి లో జరిగిన ఈ అకృత్యాన్ని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క తీవ్రంగా ఖండించారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ చిన్నారిని నేడు ఆమె పరామర్శించారు.
ఆ చిన్నారి తల్లిదండ్రులతో మాట్లాడి వారిని సీతక్క ఓదార్చారు. మూడేళ్ళ బాలికపై ఒక రోజున్నర పాటు అత్యంత క్రూరంగా అత్యాచారం చేసిన దుండగులను వెంటనే పట్టుకొని, మరో ఏ బాలికకు ఇలాంటి అన్యాయం జరగకుండా ప్రజల సమక్షంలో ఉరిశిక్ష వేయాలని ఆమె డిమాండ్ చేశారు.
బాధిత బాలికకు వెంటనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా వైద్యం అందించాలని సీతక్క డిమాండ్ చేశారు. బాలిక కుటుంబానికి తగిన న్యాయం చేయాలని ఆమె కోరారు.
ఈ కార్యక్రమంలో సీతక్కతో NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూర్ వెంకట్ తదితరులు ఉన్నారు. (ఇంకా సీతక్క ఏమన్నారంటే….. వీడియో చూడండి)