28.7 C
Hyderabad
April 24, 2024 04: 47 AM
Slider హైదరాబాద్

మూడేళ్ల బాలికపై అత్యాచారం చేసిన వాడిని ఉరితీయాలి

#seetakka

మూడేళ్ల బాలికపై అత్యంత క్రూరంగా అత్యాచారం చేశాడు ఒక మృగాడు.

హైదరాబాద్ దమ్మాయిగూడ జోహార్ నగర్ పిఎస్ పరిధి లో జరిగిన ఈ అకృత్యాన్ని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క తీవ్రంగా ఖండించారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ చిన్నారిని నేడు ఆమె పరామర్శించారు.

ఆ చిన్నారి తల్లిదండ్రులతో మాట్లాడి వారిని సీతక్క ఓదార్చారు. మూడేళ్ళ బాలికపై ఒక రోజున్నర పాటు అత్యంత క్రూరంగా అత్యాచారం చేసిన దుండగులను వెంటనే పట్టుకొని, మరో ఏ బాలికకు ఇలాంటి అన్యాయం జరగకుండా ప్రజల సమక్షంలో ఉరిశిక్ష వేయాలని ఆమె డిమాండ్ చేశారు.

బాధిత బాలికకు వెంటనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా వైద్యం అందించాలని సీతక్క డిమాండ్ చేశారు. బాలిక కుటుంబానికి తగిన న్యాయం చేయాలని ఆమె కోరారు.

ఈ కార్యక్రమంలో సీతక్కతో NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూర్ వెంకట్ తదితరులు ఉన్నారు. (ఇంకా సీతక్క ఏమన్నారంటే….. వీడియో చూడండి)

Related posts

షిరిడి సాయి బాబా మందిరంలో రధసప్తమి వేడుకలు

Satyam NEWS

వర్గీకరణకు కాంగ్రెస్ చిత్తశుద్ధితో మద్దతివ్వాలి

Satyam NEWS

ఎంసెట్ ఫలితాల్లో బిసీ గురుకుల విద్యార్థుల విజయఢంకా

Satyam NEWS

Leave a Comment