కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క నేడు ములుగు గట్టమ్మ తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ములుగు బస్ స్టాండ్ లో మేడారం జాతర కోసం ఏర్పాటు చేసిన ఆర్టీసి బస్సు లో ప్రయాణించారు. ఆర్టీసి బస్సు ప్రయాణం తో నేరుగా తల్లుల గద్దెల వరకు వెళ్ళచ్చు అని ఈ సందర్భంగా సీతక్క తెలిపారు.
మేడారం వచ్చే భక్తుల కోసం ఆర్టీసి సంస్థ మొరుగైన వసతులు కల్పించిందని ఆమె కొనియాడారు. గతంలో అమ్మవార్లను దర్శించుకోవడానికి కాలినడకన రావాల్సి వచ్చేదని, అయితే ఆ తర్వాత ప్రైవేట్ వాహనాలు వచ్చాయని, ఇప్పుడు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారని సీతక్క అన్నారు.
మరింత సులభంగా రావాలంటే హెలికాప్టర్ లో కూడా రావచ్చునని ఆమె అన్నారు. ఇవన్నీ సంతోషకరమైన పరిణామాలని సీతక్క తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానో త్ రవి చందర్, మండల అధ్యక్షుడు ఎండీ చాంద్ పాషా, ఎంపీటీసీ మవురపు తిరుపతి రెడ్డి, ఆత్మ డైరెక్టర్ ఆకు తోట చంద్ర మౌళి ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.