గత మూడు రోజులుగా సాయి సూర్య వర్మ ఇంటి ముందు మౌనిక దీక్ష చేస్తుండగా ఈరోజు ములుగు జిల్లా సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ ముంజల భిక్షపతి గౌడ్ దీక్షకు మద్దతు తెలియ చేశారు.
అనంతరం జరిగిన అనంతరం ఆయన మాట్లాడుతూ మౌనిక కు న్యాయం చేసేంత వరకు ఉద్యమాలు ఉదృతం చేస్తామని ఆయన అన్నారు. ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని వెంటనే సాయి వర్మను తీసుకువచ్చి మౌనిక కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
లేనిచో రేపు ఉదయం 11 గంటలకు అన్ని కుల సంఘాలను ప్రజా సంఘాలను కలుపుకొని ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తామని బిక్షపతి అన్నారు.
మౌనిక కు న్యాయం జరిగేంత వరకు ఊరుకునే ప్రసక్తేలేదని ఆయన అన్నారు. ప్రేమ పేరుతో మోసగించి తప్పించుకు తిరగడం పద్ధతి కాదని ఆయన అన్నారు. ఏమైనా ఉంటే కూర్చొని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో సాంబయ్య దినకర్ నరసన్న రాజు రవి రమేష్ తదితరులు పాల్గొన్నారు.