ములుగు మండలం మల్లంపల్లి గ్రామం వద్ద రెండు ఆటోలలో అధిక సంఖ్యలో కూలీలను ఎక్కించి ప్రయాణం చేయిస్తున్న వారిపై ములుగు ఎస్సై హరికృష్ణ కేసు నమోదు చేశారు.
ఒక ఆటోలో 23 మంది, మరో ఆటోలో 30 మంది ప్రయాణికులను ఎక్కించి ప్రయాణం చేస్తున్న ఆటో డ్రైవర్లపై కేసు నమోదైనట్లు ఎస్సై తెలిపారు.
ఆటోలపై కేసు నమోదు చేయడంతో కూలీ పనులకు వచ్చి మార్గ మధ్యలో ఆగిపోయిన కూలీకు ఆర్టీసీ బస్సు ఎక్కించి వారి యొక్క బస్సు చార్జీలను ఎస్సై హరికృష్ణ స్వయంగా తన సొంత డబ్బులతో చార్జీలు కట్టి కూలీలను గమ్యానికి పంపించి మానవత్వం చాటుకున్నారు.