ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ జన్మదినాన్ని పురస్కరించుకొని తెరాస ములుగు మండల అధ్యక్షుడు బాదం ప్రవీణ్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ శ్రేణులు కోలాహలంగా వేడుక జరుపుకున్నారు. మొదట జిల్లా కేంద్రంలో లో కేక్ కట్ చేసి అనంతరం చైర్మన్ జగదీష్ గపేరు మీద జాకారం గ్రామపంచాయతీ పరిధిలో గల
గట్టమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు. తరువాత ములుగు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంచిపెట్టారు. తరువాత జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ జన్మదినం సందర్భంగా ఆయన పాలన ములుగు నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జిగా ఆయన చేసిన సేవ మీద కళాకారుడు గోల్కొండ బుచ్చన్న రచించి చంద్రశేఖర్ ఆజాద్ పాడిన పాటలతో కూడిన సిడి ములుగు మండల అధ్యక్షుడు బాదం ప్రవీణ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గోవింద్ నాయక్ చేతులమీదుగా విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో మండల అధికార ప్రతినిధి ముడుతనపల్లి మోహన్, జిల్లా ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు పోరిక విజయ్ రామ్ నాయక్, వేల్పూరు సత్యనారాయణ, టౌన్ అధ్యక్షుడు సంతోష్ శీలం మధు రమేష్ రెడ్డి, గడ్డమీది భాస్కర్ మాడుగుల రమేష్, బొచ్చు సమ్మయ్యతదితర టిఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.