వెంకటపూర్(రామప్ప)మండలం కుమ్మరి సంఘము జిల్లా అధ్యక్షులు ఆశాడం దేవేందర్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ బడే నాగజ్యోతి వారి స్వగృహంలో వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. జాగ్రత్తలు తప్పకుండా పాటిస్తూ సమన్వయంతో ఉండాలి అని జడ్పీ చైర్మన్ సూచించారు. వీరి వెంట వెంకటపూర్ మండల అధ్యక్షులు లింగాల రమణ రెడ్డి ,ఎంపీపీ బుర్ర రజిత సమ్మయ్య,జడ్పీటిసి గై రుద్రమదేవి అశోక్, భద్రయ్య, బొచ్చు సమ్మయ్య ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
previous post