వికలాంగుడి సమస్య పట్ల స్పందించి ములుగు జెడ్పీ చైర్మెన్ కుసుమ జెగధీష్ తన మానవత్వం చాటుకున్నారు. జంగాలపల్లి గ్రామానికి చెందిన నూనె సతీష్ గత 8నెలల క్రితం రోడ్డు ప్రమాదం లో తన కాలు ను పూర్తిగా కోల్పోయాడు.
ప్రస్తుతం తీవ్ర ఆర్థిక యిబ్బందులలో వున్నాడు. గురువారం రోజున జెడ్పీ కార్యాలయానికి వచ్చిన ఆయన తన సమస్యలను జెడ్పీ చైర్మన్ కు విన్నవించాడు.
స్పందించిన జెడ్పీ చైర్మన్ వెంటనే జిల్లా సంక్షేమ అధికారికి ఫోన్ చేసి వివరాలు తెలిపి తన కార్యకర్తలతో ఆ వికలాంగుడు ని సంక్షేమ అధికారి ప్రేమలత వద్దకు పంపించారు.
ఆమె ఆయనకు ట్రై సైకిల్ యిప్పించేందుకు హామీ యివ్వగా సతీష్ కుటుంబ సభ్యలు సంతోషం వ్యక్తం చేశారు.