ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ కు నేడు ఒక కొత్త అనుభవం ఎదురైంది. ఈ రోజు గోవిందరావుపేట మండలంలోని బుస్సాపూర్ గ్రామ పంచాయితిలో జడ్పీ చైర్మన్ పర్యటిస్తున్న క్రమంలో ఒక వృద్ద మహిళ జడ్పీ చైర్మన్ దగ్గరకు వచ్చి కొడుకా నాకేమిస్తావని నవ్వుతూ పలికించింది.
స్పందించిన చైర్మన్ ఎవరు ఈమె అని అడుగగా స్థానికులు ఆమె పేరు గోరమ్మ అని బుస్సాపూర్ గ్రామంలో గ్రామ పంచాయితి ఏర్పడ్డ రోజు నుండి ఇప్పటి వరకు అందులోనే పనిచేస్తూ జీవనం కొనసాగిస్తుందన్న విషయాన్ని ఆయనకు తెలుపగా స్పందించిన ఆయన చిరునవ్వులు చిందిస్తూ 40 సంవత్సరాలుగా గ్రామ పంచాయితి కి తన జీవితకాలం సేవలు అందించడం అభినందించదగ్గ విషయమని అని నవ్వుతూ రూ. 2 వేలు బహుమానంగా ఇచ్చి చీర , రయిక కొనుక్కోమని అక్కడి నుండి వెళ్లిపోయారు.
కె.మహేందర్, సత్యం న్యూస్