27.7 C
Hyderabad
April 26, 2024 03: 24 AM
Slider వరంగల్

ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ ను నిలదీసిన వృద్ధురాలు

#MuluguZPChairmen

ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ కు నేడు ఒక కొత్త అనుభవం ఎదురైంది. ఈ రోజు గోవిందరావుపేట మండలంలోని బుస్సాపూర్ గ్రామ పంచాయితిలో జడ్పీ చైర్మన్ పర్యటిస్తున్న క్రమంలో ఒక వృద్ద మహిళ జడ్పీ చైర్మన్ దగ్గరకు వచ్చి కొడుకా నాకేమిస్తావని నవ్వుతూ పలికించింది.

స్పందించిన చైర్మన్  ఎవరు ఈమె అని అడుగగా  స్థానికులు ఆమె పేరు గోరమ్మ అని బుస్సాపూర్ గ్రామంలో గ్రామ పంచాయితి ఏర్పడ్డ రోజు నుండి ఇప్పటి వరకు అందులోనే పనిచేస్తూ జీవనం కొనసాగిస్తుందన్న విషయాన్ని ఆయనకు తెలుపగా స్పందించిన ఆయన చిరునవ్వులు చిందిస్తూ 40 సంవత్సరాలుగా  గ్రామ పంచాయితి కి తన జీవితకాలం సేవలు అందించడం అభినందించదగ్గ విషయమని అని నవ్వుతూ రూ. 2 వేలు బహుమానంగా ఇచ్చి చీర , రయిక కొనుక్కోమని అక్కడి నుండి వెళ్లిపోయారు.

కె.మహేందర్, సత్యం న్యూస్

Related posts

కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటానికి సిద్ధం కావాలి

Satyam NEWS

ఓ క‌లం వీరుడా ఇంకిపోవ‌డం త‌ప్ప ఒరిగిందేమీ లేదు

Satyam NEWS

ప్రతి ఒక్కరు ఈ శ్రమ కార్డ్ చేయించుకోవాలి

Satyam NEWS

Leave a Comment