పల్నాడు జిల్లా నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ రవీంద్ర నియమితులయ్యారు. మున్సిపల్ కమిషనర్ గా నియమితులైన రవీంద్ర నేడు నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిశారు. మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయనకు నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అభినందనలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేను రవీంద్ర శాలువా కప్పి పుష్పగుచ్ఛం ఇచ్చి సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీఈ శ్రీనివాస రావు, భూమిరెడ్డి శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు.