జిహెచ్ఎంసి కాప్రా సర్కిల్ పరిధిలోని కాప్రా డివిజన్ చిన్న సాయిబాబా గుడి సమీపంలో పాల బూత్ నిర్వాహకుడు శుక్రవారం ఉదయం పారిశుద్ధ్య కార్మికుడి ఇర్ఫాన్ పై కర్రతో దాడి చేశాడు. విషయం తెలుసుకున్న సర్కిల్ సహాయ వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ స్వప్న రెడ్డి సంఘటన స్థలానికి వెళ్లి సంఘటన జరిగిన తీరును విచారించారు. చెత్త ఊడ్చి ఎత్తి వేసిన తర్వాత చెట్టుకొమ్మ పడేయడంతో సదరు పారిశుద్ధ్య సిబ్బంది ఇప్పుడే ఊడ్చి, చెత్త ఎత్తివేసాను.
మళ్లీ ఎందుకు చెత్త వేస్తున్నారు భయ్యా అన్నందుకు మాట, మాట పెరిగి ఇద్దరి మధ్య ఘర్షణకు దారి తీసింది. ఈ విషయం విచారించేందుకు సంఘటన స్థలానికి వెళ్లిన స్వప్నరెడ్డి తో దాడి చేసిన వ్యక్తి దురుసుగా మాట్లాడడంతో ఈ విషయాన్ని కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శంకర్ తో పాటు కుషాయిగూడ సర్కిల్ ఇన్ స్పెక్టర్ కు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి