ప్రముఖులు, సామాజిక వేత్త, రాయలసీమ సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి గుత్తా మునిరత్నం నాయుడు గురువారం మధ్యాహ్నం పరమపదించారు.
చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో వైద్యం పొందుతూ తుదిశ్వాస విడిచారు.
శుక్రవారం భౌతిక దేహాన్ని ప్రజల సందర్శనం కోసం తిరుపతిలోని సంస్థ ప్రధాన కార్యాలయం వద్ద వుంచుతారు. అనంతరం గోవిందదామం లో దహనసంస్కారాలు జరుగుతాయి.