28.7 C
Hyderabad
April 17, 2024 05: 05 AM
Slider హైదరాబాద్

మున్నూరు కాపు సంఘం 7వ రోజు అన్నదాన కార్యక్రమం

#munnurukapu

కరోనా బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు మున్నూరు కాపు సంఘం వారి అన్నదాన కార్యక్రమం కొనసాగుతున్నది.

నేడు 7 వ రోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో  వివిధ ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్ లలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఆకలితో అలమటిస్తున్న కరోనా బాధితులకు వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి మున్నూరు కాపు (కాపు)నిత్య అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ మరియు తెలంగాణ మున్నూరు కాపు (కాపు) సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

వద్దిరాజు రవిచంద్ర పటేల్, కొండ దేవయ్య పటేల్, అల్లం కిషన్ రావు పటేల్, కొత్త లక్ష్మణ్ పటేల్  సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

అదే విధంగా హఫీజ్ పేట్ మున్నూరు కాపు సంఘం మరియు శ్రీ కృష్ణా నగర్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

రంగారెడ్డి జిల్లా కొండాపూర్ ఏరియా ఆసుపత్రి TIMS కొవిడ్ హాస్పిటల్ గచ్చిబౌలి, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్  , పంజాగుట్ట NIMS హాస్పిటల్, నల్లకుంట ఫీవర్ హాస్పిటల్,LB నగర్ ప్రభుత్వ హాస్పిటల్, నీలోఫర్ హాస్పిటల్ లలో నేడు అన్నదానం చేపట్టారు.

సుమారు 2000 మందికి భోజనం ప్యాకెట్లను  అందించామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బండి పద్మ, కాసారం రమేష్ నాయుడు, పెరిక రమేష్, వాసాల వెంకటేశ్వర్లు , వాసాల రాజు, గంప సురేష్ మరియు ఆఫీస్ పెట్ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Related posts

‘మా’ ఎన్నికల్లో మెగాస్టార్ మద్దతు ప్రకాష్ రాజ్ కే

Satyam NEWS

భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి కార్యక్రమాలు రద్దు

Satyam NEWS

లేపాక్షి ఆలయ ప్రచారం కోసం ప్రత్యేక సదస్సు

Satyam NEWS

Leave a Comment