సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా మున్నూరు కాపు ల బలోపేతానికి కృషి చేస్తానని కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గ మున్నూరు కాపు కోఆర్డినేటర్ డాక్టర్ ఉప్పు రవీందర్ అన్నారు.
గురువారం, శుక్రవారం నాగార్జున సాగర్ లో జరిగే తెలంగాణ మున్నూరుకాపు సంఘం శిక్షణ శిబిరానికి ఆయన బయలుదేరి వెళ్లారు.
శిక్షణ శిబిరం పూర్తి అయిన తర్వాత మున్నూరు కాపు మండల, గ్రామ కమిటీలు నియమిస్తామని ఆయన వెల్లడించారు.
శిక్షణ శిబిరానికి తనతో బాటు తెలంగాణ రాష్ట్ర కో కన్వీనర్ చల్లా హరిశంకర్, కరీంనగర్ జిల్లా మున్నూరు కాపు అధ్యక్షులు బొమ్మ రాధాకృష్ణ, కరీంనగర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ నలువల రవీందర్,
చొప్పదండి నియోజకవర్గం కోఆర్డినేటర్ మధుకర్, హుజురాబాద్ కోఆర్డినేటర్ పొనగంటి మల్లయ్య తదితరులు కూడా పాల్గొంటున్నారని డాక్టర్ ఉప్పు రవీందర్ తెలిపారు.