37.2 C
Hyderabad
March 28, 2024 20: 35 PM
Slider కరీంనగర్

నాగార్జున సాగర్ లో మున్నూరు కాపు శిక్షణాశిబిరం

#Dr.UppuRavindar

సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా మున్నూరు కాపు ల బలోపేతానికి కృషి చేస్తానని కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గ మున్నూరు కాపు కోఆర్డినేటర్ డాక్టర్ ఉప్పు రవీందర్ అన్నారు.

గురువారం, శుక్రవారం నాగార్జున సాగర్ లో జరిగే తెలంగాణ మున్నూరుకాపు సంఘం శిక్షణ శిబిరానికి ఆయన బయలుదేరి వెళ్లారు.

శిక్షణ శిబిరం పూర్తి అయిన తర్వాత మున్నూరు కాపు మండల, గ్రామ కమిటీలు నియమిస్తామని ఆయన వెల్లడించారు.

శిక్షణ శిబిరానికి తనతో బాటు తెలంగాణ రాష్ట్ర కో కన్వీనర్ చల్లా హరిశంకర్, కరీంనగర్ జిల్లా మున్నూరు కాపు అధ్యక్షులు బొమ్మ రాధాకృష్ణ, కరీంనగర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ నలువల రవీందర్,

చొప్పదండి నియోజకవర్గం కోఆర్డినేటర్ మధుకర్, హుజురాబాద్ కోఆర్డినేటర్ పొనగంటి మల్లయ్య తదితరులు కూడా పాల్గొంటున్నారని డాక్టర్ ఉప్పు రవీందర్ తెలిపారు.

Related posts

స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘మసూద’ నవంబర్ 11న విడుదల

Satyam NEWS

విద్యార్థులలో సృజనాత్మకతను వెలికి తీయాలి

Satyam NEWS

ప్రేమకు అంగీకరించలేదని ప్రేమ జంట బలవన్మరణం

Satyam NEWS

Leave a Comment