Slider తూర్పుగోదావరి

తన కుమార్తెతో తిరగవద్దని చెప్పినందుకు హత్య

#Crime Scene

తన కుమార్తెతో తిరగవద్దని చెప్పడమే ఆ తండ్రి చేసిన నేరం. దాంతో కోపం వచ్చిన ఆ యువకుడు ఆయనను దారుణంగా హత్య చేసిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో జరిగింది. నిడదవోలు పట్టణానికి చెందిన స్థానిక వంట మాస్టర్ వలి ని  ఓ యువకుడు హత్య చేశాడు. తన కుమార్తె వెనుక తిరుగుతున్నాడని గతంలో వైయస్సార్ కాలనీకి చెందిన ఆ యువకుడి పై వలి కేసు పెట్టారు. దీంతో ఈరోజు ఉదయం ఐదు గంటలకు నమాజు చేసుకొని తిరిగి తన ఇంటికి వస్తున్న వలీ ని అతను హత్య చేశాడు. కేసు విషయంలో రాజీకి రాలేదని కక్షతోనే ఈ హత్య చేసినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై నిడదవోలు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

శేష వాహనం పై మహావిష్ణువు గా శ్రీ సౌమ్యనాధ స్వామి..

Satyam NEWS

పండుగలా సాగిన ఆరవ విడత హరితహారం

Satyam NEWS

డాక్టర్ యం.వి.రమణారెడ్డి ఆకస్మిక మృతి తీరనిలోటు

Satyam NEWS
error: Content is protected !!