తన కుమార్తెతో తిరగవద్దని చెప్పడమే ఆ తండ్రి చేసిన నేరం. దాంతో కోపం వచ్చిన ఆ యువకుడు ఆయనను దారుణంగా హత్య చేసిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో జరిగింది. నిడదవోలు పట్టణానికి చెందిన స్థానిక వంట మాస్టర్ వలి ని ఓ యువకుడు హత్య చేశాడు. తన కుమార్తె వెనుక తిరుగుతున్నాడని గతంలో వైయస్సార్ కాలనీకి చెందిన ఆ యువకుడి పై వలి కేసు పెట్టారు. దీంతో ఈరోజు ఉదయం ఐదు గంటలకు నమాజు చేసుకొని తిరిగి తన ఇంటికి వస్తున్న వలీ ని అతను హత్య చేశాడు. కేసు విషయంలో రాజీకి రాలేదని కక్షతోనే ఈ హత్య చేసినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై నిడదవోలు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
previous post