కడప కర్నూలు జాతీయ రహదారి లోని కడప జిల్లా రామాపురం మండలం నల్లగుట్ట పల్లి వద్ద 30 సంవత్సరాల వయస్సు గల ఓ యువకుని గుర్తుతెలియని వ్యక్తులు అతి కిరాతకంగా నరికి చంపారు.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు మృతుడి ముఖంపై కత్తి గాట్లు ఉన్నాయి. అతని మర్మావయవాలు కోశారు. కాళ్లు చేతులు కూడా నరికి వేరు చేయడంతో అక్రమ సంబంధమే ఈ హత్యకు కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
మృతుడి ని గుర్తు పట్టలేని విధంగా అతి కిరాతకంగా నరికారు. ఎక్కడినుంచో గుర్తుతెలియని వాహనంలో మృతదేహాన్ని వేయడాన్ని పశువుల కాపరుల గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఆ వాహనం వివరాలు సేకరించేందుకు గువ్వల చెరువు, బండపల్లి టోల్ ప్లాజా దగ్గరున్న సిసి ఫుటేజీ లను పోలీసులు పరిశిలిస్తున్నారు.
ఈ సంఘటన పై లక్కిరెడ్డిపల్లి సిఐ యుగంధర్ రామాపురం ఎస్ఐ మైనుద్దిన్ లు మృతదేహాన్ని పరిశీలించి, హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు లక్కిరెడ్డిపల్లి సిఐ యుగంధర్ తెలిపారు.