27.7 C
Hyderabad
April 24, 2024 09: 10 AM
Slider కడప

అక్రమ సంబంధమే హత్యకు దారితీసిందా?

#Murdercase

కడప కర్నూలు జాతీయ రహదారి లోని కడప జిల్లా రామాపురం మండలం నల్లగుట్ట పల్లి వద్ద 30 సంవత్సరాల వయస్సు గల ఓ యువకుని గుర్తుతెలియని వ్యక్తులు అతి కిరాతకంగా  నరికి చంపారు.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు మృతుడి ముఖంపై కత్తి గాట్లు ఉన్నాయి. అతని మర్మావయవాలు కోశారు. కాళ్లు చేతులు కూడా నరికి వేరు చేయడంతో అక్రమ సంబంధమే ఈ హత్యకు కారణమై ఉంటుందని  పోలీసులు అనుమానిస్తున్నారు.

మృతుడి ని గుర్తు పట్టలేని విధంగా అతి కిరాతకంగా నరికారు. ఎక్కడినుంచో  గుర్తుతెలియని వాహనంలో మృతదేహాన్ని వేయడాన్ని పశువుల కాపరుల  గమనించి  పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఆ వాహనం వివరాలు సేకరించేందుకు గువ్వల చెరువు, బండపల్లి టోల్ ప్లాజా  దగ్గరున్న సిసి ఫుటేజీ లను పోలీసులు పరిశిలిస్తున్నారు.

ఈ సంఘటన పై  లక్కిరెడ్డిపల్లి సిఐ యుగంధర్ రామాపురం ఎస్ఐ మైనుద్దిన్  లు మృతదేహాన్ని పరిశీలించి, హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు లక్కిరెడ్డిపల్లి సిఐ యుగంధర్ తెలిపారు.

Related posts

న్యూ కాంట్రవర్సీ: షిర్డీ సాయి బాబాపై కొత్త వివాదం

Satyam NEWS

నటుడు కమల్ హాసన్ కు తీవ్ర అస్వస్థత

Murali Krishna

తిరుమల శ్రీవారికే శఠగోపం పెడుతున్న ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment