ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలో ఒక వివాహిత దారుణ హత్యకు గురైంది. ప్రసాద్ సెంటర్ ముత్యాలపేటలో తోట కాత్యాయని (55)ని ఎవరో నరికి చంపారు.
మృతురాలికి ఇద్దరు కుమారులు, భర్త వున్నారు. ఇద్దరు కుమారులు హైద్రాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు.
భర్త తోట వెంకట రమణ మూర్తి ఆర్ టీ సి లో కండక్టర్ గా ఉద్యోగం చేసి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.
మృతురాలి ఒంటిపై బంగారు ఆభరణాలు గల్లంతు అయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.