నిజాం నిరంకుశ పాలన పై.. రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన గిరిజన వీరుడు కొమురం భీం చరిత్రను వక్రీకరించేల రాజమౌళి దర్శకత్వంలో తీస్తున్న సినిమాలో హీరో తలపై టోపీ ధరించే సన్నివేశాన్ని వెంటనే తొలగించాలని పార్లమెంట్ సభ్యుడు సోయ బాపు రావు డిమాండ్ చేశారు.
సోమవారం ఇంద్రవెల్లి మండలంలోని మారుమూల గిరిజన గ్రామమైన చిత్త బట్ట, గౌర పూర్ గ్రామాల్లో కాలినడకన ఎంపీ సోయం బాపురావు పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సినిమాల్లో డబ్బు సంపాదన కోసం కొమురం భీం చరిత్రను వక్రీకరించడం శోచనీయమన్నారు.
రజాకార్లపై పోరాడి అమరుడైన కొమరం భీమ్ చరిత్రను వక్రీకరించలా ఆదివాసుల సంస్కృతిని మనోభావాలను దెబ్బతీసే విధంగా హీరో తలపై టోపీ ధరించే సన్నివేశం వెంటనే తొలగించాలని లేకుంటే సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించారు.
మారుమూల గిరిజన గ్రామాల్లో కొమురం భీమ్ ఆశయాలు నెరవేర్చడం లేదని.. చిత్త బట గ్రామానికి గతంలో ఎంపీ నగేష్ ..రమేష్ రాథోడ్ పర్యటించినప్పటికీ ఏమాత్రం గ్రామాల అభివృద్ధి చెందలేదని అన్నారు. ఈ గ్రామానికి వంతెన నిర్మాణం లేక వర్షాకాలంలో కష్టాలు పడుతున్న విషయాన్ని గుర్తు చేశారు.
కేంద్ర మంత్రుల తో మాట్లాడి మారుమూల గ్రామాలకు రోడ్లు నిర్మాణం చేపట్టి అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మారుమూల గ్రామాల రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బిల్లును తీసుకువచ్చారని దళారుల వ్యవస్థను పూర్తిగా రూపుమాపుతామని అన్నారు.
ఆదివాసి పి టి జి తెగలు ఉన్న గ్రామాలు ఇప్పటికీ అభివృద్ధి చెందకపోవడం శోచనీయమని వాటి మౌలిక వసతులకు వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామస్తులు నృత్య లు చేస్తూ స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా ప్రతినిధులు అధికారులు ప్రోటోకాల్ పాటించకుండా తనకు అభివృద్ధి పనులకు ఆహ్వానించకుండా వివక్ష కనబరుస్తున్నారని ఎంపీ ఆరోపించారు.
ధనోనా బి గ్రామాన్ని ఎమ్మెల్యే దత్తత తీసుకున్నప్పటికీ ఇప్పటికీ ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయకపోవడం సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టు ఉన్నాయని అన్నారు. ఎమ్మెల్యేలు మంత్రులు మారుమూల గిరిజన గ్రామాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.