ఒక ముస్లిం నాయకుడు శివలింగానికి అభిషేకంచేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఉత్తర్ ప్రదేశ్ లోని సహరాన్పూర్ జిల్లాలోని దేవ్బంద్లో రాష్ట్రీయ ముస్లిం మంచ్ జిల్లా కన్వీనర్ రావ్ ముషారఫ్ అలీ శివలింగానికి మంత్రోచ్ఛారణతో జలాభిషేకం చేశారు. ఈ వీడియోలో ముషారఫ్ అలీ శివలింగం ముందు మంత్రోచ్ఛారణలతో పూజలు చేస్తూ కనిపించారు.
ఈ సందర్భంగా ముషారఫ్ అలీ మాట్లాడుతూ, భగవంతుడు భోలేనాథ్ ఆశీస్సులు మనందరికీ ఉండాలని అన్నారు. మన పూర్వీకుల సంప్రదాయాలు మరియు భారతీయ సంస్కృతిని ముందుకు తీసుకువెళ్లేందుకే తాను భోలేనాథ్ కు అభిషేకం చేస్తుంటానని అన్నాడు.
భోలేనాథ్పై తనకు ఎంతో నమ్మకం ఉందని చెప్పారు. త్వరలో వారణాసి వెళ్లి భోలే బాబాకు జలాభిషేకం చేయనున్నట్లు ముషారఫ్ అలీ చెప్పాడు. ఇలాంటి చర్యల వల్ల ముషారఫ్ అలీ ఎప్పుడూ ఉలమా టార్గెట్లోనే ఉన్నారు. విదేశాల నుంచి కూడా అతనికి చాలా సార్లు బెదిరింపులు వచ్చాయి. దీని పై ఆయన స్థానిక పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశారు.