మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన ముస్లిం సోదరులు
మసీదు,ఈద్గాలలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్ర పరిధిలో ఉన్న 7 మసీదులు,ఈద్గాల వద్ద పారిశుధ్య పనులను వెంటనే ప్రారంభించాలని శుక్రవారం ముస్లిం మైనార్టీ సోదరులు మున్సిపాలిటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి వినతిపత్రం సమర్పించారు.
పరిష్కరించ వలసిన డిమాండ్లు
ఈద్గా వద్ద పిచ్చిమొక్కలు కంపచెట్లను తొలగించి పందులు స్వైర విహారాన్ని నివారించలని,అర్ధరాత్రి సమయంలో అంత్యక్రియలు నిర్వహించడానికి లైట్లు లేకపోవడం వల్ల ఆటంకం కలుగుతుంది అలాగే నూతనంగా ఫెడ్ లైట్లు ఏర్పాటు చేయాలని,పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా పట్టణంలో ఉన్న అన్ని మసీదుల వద్ద ప్రతి రోజు పారిశుధ్యం చేస్తూ శానిటైజింగ్ బ్లీచింగ్ చల్లించాలని,
ఈద్గా వద్ద పండగ రోజు టెంట్లు కుర్చీలు మంచినీటి సౌకర్యం నమాజ్ వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని,
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా అన్ని వార్డులలో మంచినీటి సౌకర్యం తలెత్తకుండా చూడాలని,ఉస్మానియా మసీద్ వద్ద నమాజ్ వేళల్లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలని, పేర్కొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ కు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు ఎండి.అజీజ్ పాషా,షేక్ మన్సూర్ అలీ,నవాబ్ జానీ,షేక్ బిక్కన్ సాహెబ్,మిల్లు రహీమ్,పఠాన్ గౌస్ ఖాన్, మోహిన్,నయీమ్,సలీం బాబా, జానీపాషా, ముస్తఫా,మంజూర్ అహ్మద్, రషీద్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్